ముంబైపై విజయం సాధించడం కోల్కతాకు కష్టంగా కనిపిస్తోంది. రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10), శామ్ బిల్లింగ్స్ (17), నితీష్ రాణా (8) విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కూడా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (48 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి జత కలిసిన ఆండ్రీ రస్సెల్ (11) కూడా కాసేపు మాత్రమే క్రీజులో ఉన్నాడు.
టైమల్ మిల్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు ప్రయత్నించిన రస్సెల్ విఫలమయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రెవిస్ అందుకున్నాడు. దాంతో విధ్వంసకర బ్యాటర్ అయిన రస్సెల్ పెవిలియన్ చేరగా.. ముంబై శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం కోల్కతా జట్టు 14 ఓవర్లలో 115/5 స్కోరుతో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో ఇంకా 47 పరుగులు కావలసి ఉంది.