ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బౌలర్లు విజృంభిస్తున్నారు. ఈ క్రమంలోనే 15వ ఓవర్లో బంతి అందుకున్న ప్యాట్ కమిన్స్.. ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్లను వెనక్కు పంపాడు. దీంతో ఆ జట్టు పదిహేను ఓవర్లు ముగిసే సరికి 102 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే క్రీజులో పొలార్డ్ ఉండటంతో ముంబై జట్టు ఆశలు ఇంకా పూర్తిగా అంతం కాలేదు. పొలార్డ్ విజృంభిస్తే ముంబై గెలిచే అవకాశాలు ఉన్నాయి.