IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు ముందే పలు ఫ్రాంచైజీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్లు లుంగీ ఎంగ్డి, బ్యాటర్ హ్యారీ బ్రూక్లు టోర్నీకీ దూరమయ్యారు. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్టార్ పేసర్ దిల్షాన్ మధుశనక(Dilshan Madushanaka) గాయపడ్డాడు. శ్రీలంక ప్రధాన పేసర్ అయిన మధుశనక ఎడమ కాలి కండరాల నొప్పి కారణంగా బంగ్లాదేశ్తో మూడో వన్డేకు దూరమయ్యాడు.
ఈ స్పీడ్స్టర్ కోలుకునేందుకు రెండు వారాలపైనే పట్టనుంది. దాంతో మధుషనక ఐపీఎల్ తొలి విడతలో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. మధుషనక గాయంపై లంక బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘బంగ్లాదేశ్తో రెండో వన్డేలో మధుషనక తొడకండరాల గాయంతో మైదానం వీడాడు. అతడు సిరీస్లో ఇకపై ఆడడు. అతడు కొన్ని రోజులు రిహాబిలిటేషన్ సెంటర్లో గడపనున్నాడు’ అని తెలిపింది.
🚨 Team Updates 🚨
Dilshan Madushanka will not further take part in the ongoing tour as the bowler will return to start rehabilitation work after suffering an injury during the 2nd ODI.
Madushanka, who left the field during the second ODI while bowling, has suffered a left… pic.twitter.com/O3RvhR7oHa
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 17, 2024
భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్లో మధుషనక అద్భుతంగా రాణించాడు. 8 మ్యాచుల్లోనే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 21 వికెట్లతో సత్తా చాటాడు. అందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. దాంతో, ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో మధుషనక కోసం పలు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. రూ.50 లక్షల కనీస ధర ఉన్న అతడిని చివరకు ముంబై రూ.4.60 కోట్లకు కొన్నది. ఇప్పుడు మధుశనక గాయపడడంతో ముంబై ఓవర్సీస్ బౌలర్లు జేసన్ బెహ్రెన్డార్ఫ్, నువాన్ తుషారల సేవలు వినియోగించుకోనుంది. ఉన్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో ముంబై తొలి మ్యాచ్లో భాగంగా మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.