చెన్నై: భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద.. మెల్ట్వాటర్ చాంపియన్స్ చెస్ టూర్ చేసెబుల్ మాస్టర్స్ టోర్నీలో సెమీస్లోకి దూసుకెళ్లాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్లో చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 2.5-1.5 తేడాతో చైనా గ్రాండ్మాస్టర్ వి యీను చిత్తు చేశాడు. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 90 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.
వరుసగా రెండు గేమ్లను సొంతం చేసుకోగా.. మూడో గేమ్లో చైనా జీఎం ఆధిక్యం కనబరిచాడు. ఆఖరి రౌండ్లో పైచేయి సాధించి ప్రజ్ఞానంద్ ముందంజ వేశాడు. సెమీస్లో అనిశ్ గిరి (నెదర్లాండ్స్)తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. మరో ఇద్దరు భారత జీఎమ్లు హరికృష్ణ, విదిత్ గుజరాతీ నాకౌట్ చేరకుండానే తిరుగుముఖం పట్టారు.