Mary Kom | ఢిల్లీ:పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్’గా నియమితురాలైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుపుతూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ రాసింది.
‘ఈ దేశానికి సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా. అందుకు నేను మానసికంగా సిద్ధంగా ఉన్నా. అయితే వ్యక్తిగత కారణాలతో నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా’ అని లేఖలో పేర్కొంది.