హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్కు ఊరట లభించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులపై మల్కాజిగిరి కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి అజర్ను విచారించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు అజర్ సహకరించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అజర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగినట్లు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ నాగేశ్వర్రావు ఏకసభ్య కమిటీ తేల్చింది. నిధులు దుర్వినియోగం చేసినట్లు అజర్పై ఉప్పల్ పీఎస్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.