కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 21-13, 17-21, 21-15తో హి బింగ్జియావోపై విజయం సాధించి ముందంజ వేసింది.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-19, 21-14తో బ్రైస్ లెవర్డెజ్(ఫ్రాన్స్)పై అలవోకగా గెలువగా, సాయి ప్రణీత్ 21-8, 21-9తో కెవిన్ కార్డన్(గ్వాటెమాల)ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్ తొలి పోరులో సైనా నెహ్వాల్ 21-16, 17-21, 14-21తో కిమ్ గా వున్ చేతిలో ఓడి నిష్క్రమించింది.