న్యూఢిల్లీ: తన లోక్సభ లాగిన్ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హిరానందనికి ఇచ్చినట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా( Mahua Moitra) అంగీకరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. హిరానందని గ్రూపు సీఈవో నుంచి చిన్న చిన్న గిఫ్ట్లు అందుకున్నట్లు ఆమె చెప్పారు. స్కార్ఫ్, లిప్స్టిక్లు, మేకప్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నట్లు ఆమె తెలిపారు. లోక్సభలో ప్రశ్నలు వేసేందుకే దర్శన్ హిరానందనికి పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చినట్లు మహువా చెప్పారు. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చిన ఘటనలో అక్టోబర్ 31వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకావాలని మహువాను ఆదేశించారు. ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీపై ప్రశ్నలు వేసేందుకు ఎంపీ మహువా తన లాగిన్ ఐడీలను హిరానందనికి ఇచ్చినట్లు బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.