భోపాల్: స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో శుక్రవారం లవ్లీనా ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది.
తొలి రౌండ్లో బై దక్కించుకున్న ఈ అస్సాం బాక్సర్.. తాజా పోరులో పూజా నాయక్ (ఒడిశా)పై ఘనవిజయం సాధించింది. టోక్యో కాంస్య విజేత లవ్లీనా పంచ్ల ధాటికి పూజ నిలువలేకపోవడంతో తొలి రౌండ్లోనే పోరు ముగిసింది.