Josh Little : టీ 20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఐర్లాండ్ యువ బౌలర్ జోష్ లిటిల్ తొలిసారిగా ఐపీఎల్ టోర్నీలో ఆడనున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఈ 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిన్ను రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. ఐపీఎల్ ఆడుతున్న తొలి ఐర్లాండ్ అతడే కావడం విశేషం. భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల ఈ యంగ్ బౌలర్ చాలా సంతోషంగా ఉన్నాడు. హార్దిక్ పండ్యా సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్న అని జోష్ తెలిపాడు. అంతేకాదు ‘కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నా. నాపై నమ్మకం ఉంచినందుకు గుజారత్ టైటన్స్ యాజమన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నా’ అని జోష్ లిటిల్ తెలిపాడు. టీ 20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో బౌలర్గా జోష్ లిటిల్ రికార్డు సాధించాడు. సూపర్ 12 స్టేజ్లో న్యూజిలాండ్ మీద అతను హ్యాట్రిక్ సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆడుగుపెట్టాడు. ఇప్పటివరకు 22 వన్డేలు, 53 టీ20 మ్యాచ్లు ఆడాడు.
ఈసారి వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పోటాపోటీగా జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. కామెరూన్ గ్రీన్ను 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. పోయిన ఏడాది హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది.