న్యూఢిల్లీ: అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్ టోర్నీలో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ స్వర్ణం కొల్లగొట్టాడు. గ్రీస్ వేదికగా జరిగిన 21వ అంతర్జాతీయ జంపింగ్ టోర్నీలో 8.31 మీటర్ల దూరం దూకి చాంపియన్గా నిలిచాడు. థోబియాస్ మోంట్లర్ (8.27 మీ, స్వీడన్), జూల్స్ పామరి (8.17 మీ, ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం తొలిసారిగా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న శ్రీశంకర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వామప్లోనే ఈ కేరళ లాంగ్జంపర్ 7.88 మీ, 7.71 మీటర్ల దూరం దూకి సత్తా చాటాడు. దేశవాళీ టోర్నీల్లో మనోడు వరుసగా 8 మీటర్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తూ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు.