హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాస్పిటల్ ప్రీమియర్ లీగ్(హెచ్పీఎల్) ఆరో సీజన్లో లివ్యంగ్ టీమ్ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో లివ్యంగ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో స్టాలియన్స్ 11పై గెలిచింది. స్టాలియన్స్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యఛేదనలో లివ్యంగ్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలిచింది. తొలుత స్టాలియన్స్ టీమ్ 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. టోర్నీ విజేత లివ్యంగ్ను విజన్ గ్రూపు చైర్మన్ తిరుపతిరెడ్డి ట్రోఫీ అందించి అభినందించారు. ఈ సీజన్ విజయంతంగా ముగిసినట్లు లీగ్ నిర్వాహకులు ముక్తార్, శ్యామ్, యూసుఫ్ పేర్కొన్నారు.