బ్లోయెంఫోన్టిన్: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అత్యంత అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కాంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలో దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లబుషేన్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆసీస్-దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక వన్డే సిరీస్లో లబుషేన్ ఈ రికార్డు నెలకొల్పాడు. తొలి వన్డేలో కామెరూన్ గ్రీన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడంతో అతని స్థానంలో కాంకషన్ సబ్స్టిట్యూట్గా క్రీజులోకి వచ్చిన లబుషేన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
మొత్తం 93 బంతులను ఎదుర్కొని 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెయిలెండర్ ఆస్టోన్ అగర్ (48 పరుగులు) తో కలిసి ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతర్జాతీయ క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనూ ఇప్పటి వరకు ఒక క్రికెటర్ కాంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి 80 పరుగుల భారీ స్కోర్ చేయలేదని క్రికెట్ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన గత రికార్డు కూడా లబుషేన్ పేరిటే ఉంది.
2019లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో లబుషేన్ సబ్స్టిట్యూట్గా బరిలో దిగి 59 (100 బంతుల్లో) పరుగులు చేశాడు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆసీస్-సాతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లబుషేన్, అగర్ల సూపర్బ్ ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా జట్టు కేవలం 40 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.