హైదరాబాద్: కైరో (ఈజిప్టు) వేదికగా సెప్టెంబర్ 20న మొదలయ్యే వీల్చైర్ హ్యాండ్బాల్ వరల్డ్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన కోటేశ్వర్ నాయక్ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో భారత్ తరఫున కోటేశ్వర్తో పాటు సురేశ్కుమార్, అనిల్కుమార్, అజిత్కుమార్, జావెద్ రంజాన్, సుధాంశు పటేల్, రమేశ్ షణ్ముగం బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో సుచిత్ర, మీనాక్షి హరిచంద్ర, గీతా పన్నాలాల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.