టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలో జరుగబోతున్న సౌతాఫ్రికా సిరీస్ కీలకంగా మారింది. కెప్టెన్సీ విషయంలో ఇటీవల బిసిసిఐ, కోహ్లీ మధ్య వివాదం జరుగుతున్న తరుణంలో ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ అతని టెస్టు కెప్టన్సీని సైతం ఇరకాటంలో పడేసేలా ఉంది. విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్లో రాణించగలిగితే అతనికి ర్యాంకింగ్స్తో పాటు కెప్టెన్సీ పరంగా కూడా ఉపయోగపడుతుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతవరకు టెస్టు ర్యాంకింగ్స్లో బ్యాటర్గా 5వ స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా మరో రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉన్నాడు.
తాజా ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్ ఆక్రమించుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లలో అద్భుత ఆటతీరు కనబర్చి మార్నస్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానం పొందాడు. ఈ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టన్ జో రూట్ రెండవ స్థానంలో ఉన్నాడు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐసిసి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టిక పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కుమ్మిన్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.