Ganguly Vs Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ రసవత్తరంగా సాగుతున్నది. నువ్వా.. నేనా అన్న రీతిలో జట్లు తలపడుతున్నాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకరికొకరు కరచలనం చేసేందుకు విముఖత చూపారు. అయితే, ఈ విషయంపై భారత జట్టు మాజీ ఆటగాడు, మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
‘ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు X, మరొకరు Y. ప్లేయర్ X గొప్ప ప్లేయర్, మాజీ కెప్టెన్. లెజెండ్ ఆటగాడు. ప్లేయర్ Y సైతం గొప్ప ఆటగాడు. అతను మాజీ కెప్టెన్. అతను ఇంకా ఆడుతున్నాడు. ప్లేయర్ X ఓ జట్టుకు డైరెక్టర్ కొనసాగుతుంటే.. ప్లేయర్ Y మరో జట్టు కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్లేయర్ X, ప్లేయర్ Y ఒకరినొకరు అయిష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఇరుజట్లు కరచలనం చేసుకున్నాయి. ప్లేయర్ X, ప్లేయర్ Y కరచలనం కరచలనం చేసేందుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవాలనుకోవడం లేదు. మీరు X, Y ప్లేయర్లతో మాట్లాడతారా..? మీరు వారికి ఏవైనా సలహాలు ఇస్తారా? అడుగుతుంటారు’ అని పేర్కొన్నాడు.
దానిపై స్పందిస్తూ.. ‘నా సంబంధం ఏమిటనేదానిపై ఆధారపడి ఉంటుంది. నేను అస్సలు మాట్లాడకూడదనుకుంటే దాన్ని దేటవేస్తా. కానీ చివరలో మీరు వెళ్లి కూర్చున్నప్పుడు, మీరు ఎంత పెద్దవారైనప్పటికీ, ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ స్థలం ఉందని మీరు గ్రహిస్తారు’ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. 2021లో క్లోహీని వన్డే, టీ20 కెప్టెన్గా బీసీసీఐ తొలగించి, రోహిత్కు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ విషయంపై అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే జట్టుకు కెప్టెన్గా విరాట్ను తప్పించడంపై.. ముందుగానే విరాట్తో మాట్లాడినట్లు తెలిపాడు.
టీ20లకు కెప్టెన్గా విరాట్ తప్పుకోవడంపై మాట్లాడామని, అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు వేర్వేరు కెప్టెన్లు ఉండడం సెలెక్షన్ కమిటీకి నచ్చలేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత దీనిపై విరాట్ స్పందిస్తూ వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉంటాడని 90 నిమిషాల కిందటే బీసీసీఐ అధికారులు తనకు తెలిపారని చెప్పాడు. బీసీసీఐ తనతో ఎలాంటి చర్చలు జరుపలేదని, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు బీసీసీఐ వద్దకు వెళ్లి నిర్ణయాన్ని తెలిపినట్లు తెలిపాడు. తన ఆలోచనలు, ఆందోళనలను బీసీసీఐ దృష్టికి తెచ్చానని, బోర్డు అందుకు అంగీకరించి న కష్టాలను అర్థం చేసుకుందని, నిర్ణయాన్ని పునరాలోచించమని అడగలేదని తెలిపాడు. దాంతో గంగూలీ, విరాట్ల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడం గమనార్హం.