దుబాయ్: భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన టీ20 ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో ఒక స్థానం ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకుల్లో 729 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 24 స్థానాలను మెరుగుపర్చుకుని 59వ ర్యాంకుకు చేరాడు. 809 పాయింట్లతో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ మొదటి ర్యాంకులో స్థిరంగా ఉన్నాడు. వన్డే ర్యాంక్ల విషయానికొస్తే కోహ్లీ 11కు పడిపోగా, రోహిత్ శర్మ 645 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.