న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో (ODI World cup 2023) ఆడాలన్న వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్గా ఉండటంతో అతనినే జట్టుకు ఎంపికచేయనున్నట్లు తెలుస్తున్నది. 15 మందితోకూడిన భారత జట్టును (Team India) బీసీసీఐ (BCCI) నేడు ప్రకటించే అవకాశం ఉంది. దీనికోసం చీఫ్ సెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) శ్రీలంకకు (Srilanka) పయణమయ్యారు. జట్టు యాజమాన్యంతో చర్చించి ప్రపంచకప్ టీమ్ను ప్రకటించనున్నారు. రాహుల్నే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.
దాదాపుగా ఆసియాకప్కు (Asia Cup) ఎంపికచేసిన టీమ్నే వరల్డ్ కప్నకు పంపిస్తామని అప్పుడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 17 మందితో కూడిన ఆసియాకప్ జట్టులో ఇద్దరిని తప్పించనున్నారు. వారిలో ఇద్దరు ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna), తిలక్ వర్మ (Tilak Varma). ఇక కేఎల్ రాహూల్కు బ్యాకప్గా సంజూ శాంసన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే రాహూల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ప్రపంచ కప్ జట్టులో రాహుల్నే అడించే అవకాశం ఉన్నది. ఇప్పటికే యజువేంద్ర చాహల్కు జట్టులో స్థానం లభించని విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, బ్యాట్స్మెన్), విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్ధుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్ర.