కోల్కతా బౌలర్ల ధాటికి స్వల్పస్కోరుకే ఆలౌట్ అయిన పంజాబ్ జట్టు.. బౌలింగ్ దాడిని త్వరగానే ఆరంభించింది. సౌతాఫ్రికా వెటరన్ కగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫామ్లో ఉన్న అజింక్య రహానే (12) పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లు కొట్టి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన రహానే.. ఆఫ్స్టంప్ ఆవల వేసిన ఫుల్లెంగ్త్ బంతిని ఆడేందుకు ప్రయత్నించాడు.
ముందుకొచ్చి డ్రైవ్ చేసే క్రమంలో దూరంగా వెళ్తున్న బంతిని కదిలించాడు. దాంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని ఒడియన్ స్మిత్ వేగంగా స్పందించి అందుకున్నాడు. దాంతో రహానే ఇన్నింగ్స్ ముగిసింది. రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ జట్టు 14/1 స్కోరుతో నిలిచింది.