ముంబై: చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ వరకు పోరాడిన
కోల్కతా నైట్రైడర్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఓటమి బాధలో ఉన్న
కోల్కతాకు మరో షాక్ తగిలింది. వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
ఐపీఎల్ 2021లో నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు ఇప్పటికే చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ,
ముంబై సారథి రోహిత్ శర్మలకు జరిమానా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కనీస ఓవర్రేట్ తప్పిదం కారణంగా అతని జట్టు సీజన్లో మొదటి ఉల్లంఘనకు పాల్పడటంత మోర్గాన్కు రూ.12లక్షల ఫైన్ విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండోసారి స్లో ఓవర్రేట్ నమోదు చేస్తే రూ.24లక్షల జరిమానా వేస్తారు. కెప్టెన్తో పాటు, తుది జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా విధించనున్నారు.