హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 16: ఫెడరేషన్ కప్ అండర్-20 అథ్లెటిక్స్ టోర్నీలో ఖమ్మం ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో హనుమకొండ, బాలికల విభాగంలో నాగర్కర్నూల్ జిల్లాలు ముందు వరసలో నిలిచాయి.
రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి సుమారు 350 మంది అథ్లెట్లు.. 40 ఈవెంట్లలో పోటీపడ్డారు. వీటిలో సత్తాచాటిన వాళ్లు ఈ నెల 28 నుంచి తమిళనాడులో జరుగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్రాజ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ వరద రాజేశ్వర్రావు ట్రోఫీలు అందజేశారు.