షార్జా: ఐపీఎల్ 2021( IPL 2021 )లో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అది. టీ20 క్రికెట్లో 10 వేల పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా పొలార్డ్ నిలిచాడు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పొలార్డ్ ఈ రికార్డు అందుకున్నాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ల వికెట్లు తీసిన పొలార్డ్ ఈ అరుదైన డబుల్ పూర్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్తోపాటు దాదాపు అన్ని లీగ్లలో ఆడే పొలార్డ్.. ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకూ అతడు తన కెరీర్లో 560కిపైగా టీ20 మ్యాచ్లు ఆడాడు.