కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) కార్యదర్శి జగన్మోహన్రావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. కరీంనగర్లో క్రికెట్కు శ్రీకారం చుట్టి సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి జగన్మోహన్రావు ప్రధాన కార్యదర్శిగా ఎనలేని సేవలు అందించారు. జిల్లా నుంచి జాతీయస్థాయికి ఆడేలా ప్లేయర్లను ఆయన ప్రోత్సహించారు. జగన్మోహన్రావు మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్, కేడీసీఏ ప్రతినిధులు ఆగం రావు, మురళీధర్రావు, మహేందర్గౌడ్, మహిపాల్, హరిశంకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.