హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్ నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ల్లో కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్ సత్తాచాటాయి. మంగళవారం ఉప్పల్లో జరిగిన వేర్వేరు మ్యాచ్ల్లో ఈ జట్లు తమ ప్రత్యర్థులను ఓడించి ప్లేఆఫ్స్ చేరాయి.
మొదట పాలమూరు స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో కరీంనగర్.. 73 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరో మ్యాచ్లో రంగారెడ్డి.. 161 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్ను ఓడించింది. కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డికి తలా 8 పాయింట్లే ఉండగా మెరుగైన రన్రేట్తో కరీంనగర్, రంగారెడ్డి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లాయి.