ఢిల్లీ: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. తొలి నాలుగు ఓవర్లు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. జయంత్ యాదవ్ వేసిన ఐదో ఓవర్లో బట్లర్ ఫోర్, సిక్స్ బాది 13 పరుగులు రాబట్టాడు. నాథన్ కౌల్టర్ నైల్ వేసిన ఆరో ఓవర్లో జైశ్వాల్ ఫోర్,సిక్స్ కొట్టడంతో 14 రన్స్ వచ్చాయి. దీంతో పవర్ప్లే ఆఖరికి రాజస్థాన్ 47/0తో నిలిచింది. బట్లర్(26), జైశ్వాల్(20) క్రీజులో ఉన్నారు.