హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి డబుల్ ధమాకా మోగించింది. 100 మీటర్ల పరుగులో శుక్రవారం రజతం కొల్లగొట్టిన దీప్తి తాజాగా 200 మీటర్ల రేసులో కాంస్య పతకం కైవసం చేసుకుంది.
గుజరాత్లోని నడియాడ్లో శనివారం జరిగిన రేసులో దీప్తి 24.61 సెకండ్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో మరో తెలంగాణ అథ్లెట్ నకిరేకంటి మాయావతి 25.45 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.