లండన్ : భవిష్యత్తులో యువ క్రీడాకారిణులలో స్ఫూర్తి నింపేందుకు తనవంతు తోడ్పాటును అందిస్తానని భారత పేసర్ జులన్ గోస్వామి తెలిపింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన జులన్ రెండు దశాబ్దాలుగా క్రికెట్ను ఆస్వాదించానని, ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేయడంలో తనవంతు కృషి చేస్తానన్నది. ఇంగ్లండ్తో తన అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన ఈ పేసర్ ఇంగ్లండ్తో సిరీస్తోనే కెరీర్ను ముగించడం యాదృచ్ఛికం. మహిళా ఫాస్ట్ బౌలర్లలో మేటి క్రీడాకారిణిగా పేరొందిన జులన్ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా కెరీర్కు ఘనంగా స్వస్తి పలికింది. జులన్ తన కెరీర్లో 12 టెస్టులలో 44 వికెట్లు, 204 వన్డేలలో 255 వికెట్లు, 68 టి20లలో 56 వికెట్లు సాధించింది. జులన్ అయిదు ఐసిసి వన్డే మహిళా ప్రపంచకప్లలో, అయిదు టి20 మహిళా ప్రపంచకప్లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.