భారత పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 16న రంజీ ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని అతను బీసీసీఐని కోరాడు. దాంతో అతడిని రెండో టెస్టు స్క్వాడ్ నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. సౌరాష్ట్ర ప్రధాన బౌలర్ అయిన ఉనాద్కత్ త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో కర్నాటకపై గెలిచి ఫైనల్ చేరుకుంది. బెంగాల్ జట్టు సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ను ఓడించి టైటిల్ వేటకు సిద్ధమైంది. ఆ జట్టు 306 పరుగుల తేడాతో గెలుపొందింది.
పోయిన ఏడాది విజయ్ హజారే ట్రోఫీ విజేతగా నిలిచిన సౌరాష్ట్ర రంజీ ట్రోఫీపై కన్నేసింది. అర్పిత్ వసవడా, షెల్డన్ జాక్సన్ కర్నాటక మ్యాచ్లో సెంచరీలతో రాణించారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు 232 రన్స్ జోడించారు. వీళ్లు ఫైనల్లోనూ చెలరేగితే ఆ జట్టు ఛాంపియన్గా నిలవడం ఖాయం.
రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఉనాద్కత్ ఆస్ట్రేలియాతో మొదటి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అయితే తొలి టెస్టుకు అతను బెంచ్కే పరిమితం అయ్యాడు. నాగ్పూర్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 రన్స్తో ఆసీస్ను చిత్తు చేసింది. రవీంద్ర జడేజా 7 వికెట్లు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లతో చెలరేగారు. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఢిల్లీలో ఫిబ్రవరి 17న మొదులు కానుంది.
NEWS – Jaydev Unadkat released from India’s squad for 2nd Test to take part in the finals of the Ranji Trophy.
More details here – https://t.co/pndC6zTeKC #TeamIndia pic.twitter.com/8yPcvi1PQl
— BCCI (@BCCI) February 12, 2023