Women’s National Boxing Championship: గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న మహిళల జాతీయ ఛాంపియన్షిప్లో సర్వీసెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మనీషా మౌన్, జాస్మిన్ లంబోరియాలు సెమీస్కు దూసుకెళ్లారు. సోమవారం ఇక్కడ ముగిసిన క్వార్టర్స్ పోరులో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి సెమీస్కు అర్హత సాధించారు. 60 కిలోల విభాగంలో పోటీ పడుతున్న హర్యానాకు చెందిన మనీషా.. క్వార్టర్స్లో 5-0 తేడాతో మిజోరాంకు చెందిన లల్రెమ్రౌతిని ఓడించింది. సెమీస్ పోరులో మనీషా.. పంజాబ్ బాక్సర్ సిమ్రాన్జిత్ కౌర్ను ఢీకొననుంది.
మరో క్వార్టర్స్లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ కాంస్య పతక విజేత జాస్మిన్.. మహారాష్ట్రకు చెందిన పూనమ్ కైత్వాస్పై విజయం సాధించింది. రెఫరీ స్టాప్స్ కంటెస్ట్ (ఆర్ఎస్సీ) విధానంలో జాస్మిన్ను విజేతగా తేల్చారు. సెమీస్లో జాస్మిన్.. తమిళనాడు బాక్సర్ పీఎస్ గిర్జాతో తలపడనుంది.