IND vs RSA : సెంచూరియన్లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. దక్షిణాఫ్రికా పేసర్లు బౌన్సర్లతో హడలెత్తిస్తున్నా రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ(18), శ్రేయస్ అయ్యర్(6) సహనంతో ఆడుతున్నారు. దాంతో, టీ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 362 రన్స్ చేసింది. ఇంకా భారత జట్టు 101 పరుగులు వెనకబడి ఉంది. ఆఖరి సెషన్లో కోహ్లీ, అయ్యర్ ఎంత సేపు ఆడతారు? సఫారీ పేసర్లను ఏమేరకు ఎదుర్కొంటారు? అనేది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.
ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(0)ను రబాడ డకౌట్ చేశాడు. ఆ కాసేటికే కుర్రాడు యశస్వీ జైస్వాల్(5)ను బర్గర్ సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో శుభ్మన్ గిల్(26), విరాట్ కోహ్లీ(18)లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
India’s top three sent 🔙
South Africa on 🔝https://t.co/d8VcaImuFx | #SAvIND pic.twitter.com/jzn1NqJM6s
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
కాస్త కుదురుకున్నాక గిల్ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ, జాన్సేన్ అద్భుతమైన బంతితో గిల్ ఇన్నింగ్స్కు తెరదించాడు. మూడో రోజు బుమ్రా 4 వికెట్లతో చెలరేగంతో సఫారీలను 408 పరుగులకే పరిమితమైంది. డీన్ ఎల్గర్(185), మార్కో జాన్సేన్(84) భారీ భాగస్వామ్యంలో ప్రొటిస్ జట్టు 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.