ఢిల్లీ: ఇటీవలే భారత జట్టులో చోటు దక్కించుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ కౌంటీల్లో ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. త్వరలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో ఈ కశ్మీర్ బౌలర్కు రెడ్బాల్ ప్రాక్టీస్ కోసం అతడిని కౌంటీల్లో ఆడించేందుకు బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.
ప్రముఖ క్లబ్ సర్రే అతడిని తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంగ్లండ్తో పోలిస్తే న్యూజిలాండ్ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ కోసమైనా అతడిని కౌంటీలకు పంపాలని బీసీసీఐ భావిస్తున్నది.