హైదరాబాద్, ఆట ప్రతినిధి: చికాగో(అమెరికా)లో జరిగే ప్రపంచ స్థాయి మారథాన్ పోటీలకు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన జగన్మోహన్రెడ్డి అర్హత సాధించాడు. వచ్చే నెల 10వ తేదీన జరిగే ఫుల్ మారథాన్(42.2కి.మీ)లో జగన్ బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా శనివారం తన చాంబర్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్..జగన్ను ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 30వేల మంది పాల్గొననున్న మారథాన్లో సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్ఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.