హైదరాబాద్: ట్యూనిషియా వేదికగా జరిగిన ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ యువ ప్లేయర్ సాయికార్తీక్ రెడ్డి సత్తాచాటాడు. మనీశ్సురేశ్ కుమార్తో కలిసి టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, మనీశ్ జోడీ 4-6, 6-7(4/7) తేడాతో జెంగ్ బౌలో,మాక్సిమస్ జోన్స్ ద్వయం చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు జరిగిన సెమీస్లో కార్తీక్, మనీశ్ ఆకట్టుకున్నారు.