Brett Lee : వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ అంతగా ఫామ్లో లేకపోవడంతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య ఎదుర్కొంటోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఈ సమ్యకు ఒక పరిష్కారం సూచించాడు. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్లో భారత్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపాలని అతను అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఓపెనర్ రేసులో అతను ముందువరసలో ఉన్నాడని అన్నాడు. బ్రెట్లీ సోమవారం తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘విధ్యంసకర ఆటతీరుతో ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి 2023 వన్డే వరల్డ్ కప్ ఓపెనర్ రేసులో తాను ఉన్నానని ప్రకటించాడు. ఇది జరగుతుందా? లేదా? అనేది నాకు తెలియదు. కానీ, అతను ఓపెనర్గా రావాలని కోరుకుంటున్నా’ అని బ్రెట్లీ అన్నాడు. అయితే.. ఓపెనర్గా ఎంపిక కావాలంటే ఇషాన్ ఇదే ఫామ్ను కొనసాగించాలని, ఫిట్నెస్ కాపాడుకోవాలని బ్రెట్లీ తెలిపాడు.
బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో 24 ఏళ్ల ఇషాన్ వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 126 బంతుల్లోనే ఇషాన్ ద్వి శతకం పూర్తి చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో 210 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023కు ముందు ఇషాన్ ఫామ్ను అందిపుచ్చుకున్నాడు. ఈ యంగ్స్టర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. పోయిన ఏడాది వేలంలో ముంబై ఫ్రాంఛైజీ అతడిని రూ.15.25 కోట్లకు కొన్నది.