ఐపీఎల్ 16వ సీజన్ త్వరలోనే మొదలుకానుంది. దాంతో, అన్ని జట్లు ముఖ్యమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, మిగతావాళ్లను వదులుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేకేఆర్ ట్రేడ్ ఒప్పందంలో ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రౌడర్స్(కేకేఆర్) జట్టు తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ని కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో శార్థూల్ని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే, ఆశించినంతగా రాణించకపోవడంతో డిల్లీ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది. శార్థూల్ని అమ్మేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విడత ట్రేడ్ ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది.
కేకేఆర్ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా శార్థూల్తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఆల్రౌండర్ ల్యూక్ ఫెర్గూసన్, రహమనుల్లా గుర్బాజ్లను తీసుకుంది. నవంబర్ 15వ ఆఖరు తేదీ కావడంతో అన్ని జట్లు ఇప్పటికే కొందరు ఆటగాళ్లను ఇతర జట్లకు అమ్మేశాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన శార్థూల్ అద్భుత ప్రదర్శన చేసి, భారత జట్టులో చోటు సంపాదించాడు. లార్డ్స్ టెస్ట్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, 2022 ఐపీఎల్ వేలంలో పది కోట్లకు పైగా చెల్లించి ఢిల్లీ క్యాపిట్సల్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, శార్థూల్ బ్యాటింగ్, బౌలింగ్లో పెద్దగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచుల్లో 120 పరుగులు మాత్రమే తీశాడు. బౌలింగ్లో 9.79 సగటుతో 15వికెట్లు తీశాడు.