ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే లీగ్స్లో ఐపీఎల్ ఒకటి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. దాదాపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ ఎక్కువ రెవెన్యూ ఆర్జిస్తోందని గంగూలీ తెలిపాడు. ఈ సూపర్ ఫుట్బాల్ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆర్జన విషయంలో ఐపీఎల్ దానికి ఏమాత్రం తీసిపోదని గంగూలీ అభిప్రాయం.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఆట నా కళ్ల ముందే చాలా కొత్తగా మారడం చూశాను. నాలాంటి ఆటగాళ్లు అప్పట్లో కొన్ని వందల రూపాయలు మాత్రమే సంపాదించే వాళ్లు. ఇప్పుడు చూస్తే కొందరు క్రీడాకారులు కోట్ల రూపాయలు పొందుతున్నారు’’ అని దాదా చెప్పాడు.
తను ఇష్టపడే ఈ క్రీడ ఇంత బలంగా అభివృద్ధి చెందినందుకు తాను చాలా గర్వంగా, సంతోషంగా ఫీలవుతున్నానని ఈ మాజీ టీమిండియా సారధి పేర్కొన్నాడు. ప్రస్తుతం, వచ్చే నాలుగేళ్ల కోసం ఐపీఎల్ మీడియా హక్కుల వేలాన్ని బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ టీవీ బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కలిపి సుమారు రూ.43 వేల కోట్ల ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.