ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక లాభదాయకమైన టోర్నమెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కొత్తగా రెండు జట్లు చేరాయి. దీంతో మొత్తం పది జట్లు ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. 2022 వరకు స్టార్ ఇండియా ఈ టోర్నీ బ్రాడ్కాస్టింగ్ హక్కులు కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్ను బీట్ చేసిన ఈ సంస్థం రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది.
ఈ డీల్తో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు రూ.55 కోట్లకు చేరింది. అయితే ఈ డీల్ ఈ ఏడాదితో ముగిసింది. దీంతో కొత్త డీల్ కోసం మరోసారి సోనీ, రిలయన్స్, డిస్నీ, అమెజాన్ పోటీ పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ వేలం నుంచి అమెజాన్ తప్పుకుందట. కారణం ఏంటో తెలియరాలేదు కానీ.. అమెజాన్ ఈ వేలంలో పాల్గొనడం లేదని మాత్రం వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.