ఈసారి జరిగే ఐపీఎల్ మెగా వేలంలో ఇద్దరు భారత యువ ఆటగాళ్లకు భారీ ధర పలనకుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, అనలిస్ట్ హర్ష భోగ్లే. భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు ఈసారి వేలంలో మంచి ధర లభిస్తుందని భోగ్లే చెప్పాడు.
అలాగే దేశవాళీల్లో తమిళనాడు తరఫున అద్భుతంగా రాణించిన ఫినిషర్ షారుఖ్ ఖాన్ కూడా మంచి ధర సొంతం చేసుకుంటాడని ఈ లెజెండరీ వ్యాఖ్యాత అభిప్రాయపడ్డాడు. గత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్ కిషన్.. తన అద్భుతమైన ప్రదర్శనలతో భారత జట్టులో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడిన హర్షభోగ్లే.. ‘షారుఖ్ ఖాన్కు మంచి ధర పలుకుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే క్రీజులో అతని ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అతను కొంచెం యూసుఫ్ పఠాన్లా ఉంటాడు’ అని చెప్పాడు. లోయర్ ఆర్డర్లో వచ్చే షారుఖ్ ఖాన్.. మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. నెటిజన్లు చాలా మంది అతన్ని ధోనీ వారసుడిగా కీర్తించడం కూడా తెలిసిందే.