IPL 2022 | ఐపీఎల్-2022 సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సారధిని ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ తమ జట్టు సారధిగా ఉంటాడని కేకేఆర్ బుధవారం తెలిపింది. 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా తొలిసారి జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఐదేండ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన శ్రేయాస్ అయ్యర్ను ఇటీవల జరిగిన ఐపీఎల్ -2022 మెగా వేలంలో కేకేఆర్ సొంతం చేసింది.
గత శని, ఆదివారాల్లో బెంగళూరులో పోటాపోటీగా సాగిన వేలం ప్రక్రియలో శ్రేయాస్ అయ్యర్ కోసం ఫ్రాంచైసీలు పోటీ పడ్డాయి. విరాట్ కోహ్లీకి చెందిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ), హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలోని గుజరాత్ టైటాన్స్, కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి.
మాజీ చాంపియన్ అయిన కేకేఆర్.. వేలంలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ను దాటేసి రూ.12.25 కోట్లకు శ్రేయాస్ అయ్యర్ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో రెండుసార్లు కేకేఆర్ చాంపియన్షిప్ గెలుచుకుంది. కేకేఆర్ ఫ్రాంచైసీకి సారధ్యం వహించడం తనకు గౌరవం అని శ్రేయాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights
অধিনায়ক #ShreyasIyer @ShreyasIyer15 #IPL2022 #KKR #AmiKKR #Cricket pic.twitter.com/veMfzRoPp2
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022