గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే కేకేఆర్ డెత్ బౌలింగ్ ప్రదర్శన.. క్రికెట్ అభిమానుల దృష్టి ఆకర్షించింది.
గతేడాది డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన జట్టు కోల్కతానే. మొత్తంగా డెత్ ఓవర్లలో 46 వికెట్లు పడగొట్టిందా జట్టు. అయితే కేకేఆర్ డెత్ బౌలింగ్ స్పెషలిస్టుల్లో ఒకడైన లోకీ ఫెర్గూసన్ను ఈ ఏడాది కేకేఆర్ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు దగ్గర ఆండ్రీ రస్సెల్. సునీల్ నరైన్ మాత్రమే డెత్ ఓవర్లు వేయగలిగే సమర్థత కలిగి ఉన్నారు.
ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకమైన సలహా ఇచ్చాడీ జట్టుకు. కుదిరితే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి డెత్ బౌలింగ్ ఇవ్వాలని సూచించాడు. చివర్లో వరుణ్కు రెండు ఓవర్లు ఇవ్వడం ద్వారా కేకేఆర్ డెత్ బౌలింగ్ బలంగా తయారవుతుందని ఇర్ఫాన్ అన్నాడు.
అతనితోపాటు శివమ్ మావి, ఉమేష్ యాదవ్ చెరో ఓవర్ వేయొచ్చని.. ఫిట్గా ఉంటే రస్సెతో రెండు ఓవర్లు ఇవ్వవచ్చని అన్నాడు. డెత్ ఓవర్లలో రెండు ఓవర్లు వరుణ్కు ఇస్తే కేకేఆర్ అవకాశాలు మరింత మెరుగవుతాయని వివరించాడు. మరి ఈ నెల 26న చెన్నై సూపర్ కింగ్స్తో టోర్నీ ఓపెనర్ ఆడనున్న కేకేఆర్.. డెత్ బౌలింగ్లో మళ్లీ సత్తా చాటుతుందేమో చూడాలి.