ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి రెండు కొత్త జట్లు రానున్నాయి. అయితే ఆ రేసులో అహ్మదాబాద్, లక్నో నగరాలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దుబాయ్లో తాజాగా ముగిసిన ఐపీఎల్ టోర్నీని .. చెన్నై జట్టు గెలుచుకున్నది. అయితే అహ్మదాబాద్ నుంచి బహుళా జాతి సంస్థ అదానీ గ్రూపు బిడ్డింగ్ వేయనున్నది. ప్రీమియర్ లీగ్లో పోటీపడే మాంచెస్టర్ యునైటెడ్ ఓనర్స్ గ్లేజర్ ఫ్యామిలీ కూడా బిడ్డింగ్కు ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ఈ నెల 25వ తేదీన జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అత్యధికంగా బిడ్డింగ్ సమర్పించే ఇద్దరికి ఫ్రాంచైజీ హక్కులు లభిస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ టోర్నీలో పది జట్లు పోటీపడుతాయి.
బిడ్డింగ్ కోసం దరఖాస్తు స్వీకరణను అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. బిడ్డింగ్ ద్వారా సుమారు పదివేల కోట్లు ఆర్జించాలని బీసీసీఐ భావిస్తున్నది. బిడ్డింగ్ పేపర్లు దాఖలు చేసిన వారిలో సంజీవ్కుమార్(ఆర్పీఎస్జీ), గ్లేజర్ ఫ్యామిలీ(మాంచెస్టర్ యునైటెడ్), అదానీ గ్రూపు, నవీన్ జిందాల్(జిందల్ పవర్ అండ్ స్టీల్), టొరెంట్ ఫార్మా, రోనీ స్క్రీన్వాలా, అరబిందో ఫార్మా, కోటక్ గ్రూపు, సీవీసీ పార్ట్నర్స్, సింగపూర్కు చెందిన పీఈ కంపెనీ, హిందుస్తాన్ టైమ్స్ మీడియా, బ్రాడ్కాస్ట్ అండ్ స్పోర్ట్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ గ్రూపులు ఉన్నాయి.