Praggnanandhaa | టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మూడో రౌండ్ పోరులో ప్రజ్ఞానంద..భారత్కే చెందిన విదిత్ గుజరాతిపై విజయం సాధించాడు. 45 ఎత్తుల్లో ముగిసిన పోరులో ప్రజ్ఙానంద, విదిత్ ఆద్యంతం హోరాహోరీగా తలపడ్డారు. ఆది నుంచే ఈ చెన్నై చిన్నోడు..విదిత్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగాడు.
పుంజుకుని పోటీలోకి వచ్చేందుకు విదిత్ ప్రయత్నించినా అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు నెపోమినియాచితో పోరును గుకేశ్ డ్రా చేసుకోగా, మహిళల పోరులో వైశాలి..నుర్గ్యుల్ సలిమోవాను ఓడించి ముందంజ వేసింది. జోంగ్యి తాన్తో గేమ్ను హంపి డ్రా చేసుకుంది.