న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ కర్మన్కౌర్ థండి.. ఐటీఎఫ్ మహిళల టోర్నీలో రన్నరప్గా నిలిచింది. కెనడాలో జరిగిన సకాటూన్ చాలెంజర్ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో కర్మన్-స్టాసీ ఫంగ్ (కెనడా) జోడీ 6-4, 4-6, 7-10తో రెంచెల్-అలానా స్మిత్ జంట చేతిలో ఓడింది.