కేప్టౌన్ : భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్తో జరిగిన తొలి హాకీ మ్యాచ్లో 1-3 తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ప్రత్యర్థిని నిలువరించిన భారత జట్టు చివరి క్షణాల్లో పట్టు సడలించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను 3-0తో గెలుచుకున్న భారత జట్టు నెదర్లాండ్స్తో మూడు మ్యాచ్ల సిరీస్ను ఓటమితో ఆరంభించింది. తొలి క్వార్టర్లో డంగ్డంగ్ 24వ నిమిషంలో చేసిన గోల్తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. 29వ నిమిషంలో ఫిలిస్ ఆల్బర్స్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి స్కోరును సమం చేసింది. ఆపై మూడో క్వార్టర్లో గోల్కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరి క్వార్టర్లో యిబ్బి జాన్సెన్, ఫ్రీకి మోస్ చేసిన గోల్స్తో నెదర్లాండ్స్ను విజయం వరించింది.