గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు(AUSvIND).. మూడవ రోజు వర్షం అడ్డుగా నిలిచింది. ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసిన సమయంలో వర్షం పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఇంకా ఆట మొదలుకాలేదు. అంతకముందు ఆస్ట్రేలియా 445 రన్స్కు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా.. పేలవ ఆటను ప్రదర్శించింది. భారత టాపార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ మినహా.. మిగితా బ్యాటర్లు ఆసీస్ పేసర్లను అడ్డుకోలేకపోయారు.
జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేసి ఔటయ్యారు. స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా.. హేజిల్వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భోజన విరామ సమయానికి ఇండియా 22 రన్స్కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెషన్లో కీలకమైన పంత్ వికెట్ను కూడా చేజార్చుకున్నది.
టీ బ్రేక్ సమయానికి రాహుల్ 30, రోహిత్ ఖాతా తెరవకుండా క్రీజ్లో ఉన్నారు. అయితే వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి ఇండియా ఇంకా 397 రన్స్ వెనుకబడి ఉన్నది.
It is still raining in Brisbane and that will be Tea on Day 3.#TeamIndia 48/4 in the 1st innings
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/Ro6VapMGcw
— BCCI (@BCCI) December 16, 2024