బెంగళూరు: భారత టెన్నిస్ ప్లేయర్ అంకిత.. ఐటీఎఫ్ మహిళల ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ అంకిత 6-2, 6-1తో థాయ్లాండ్ ప్లేయర్ లన్లానా టారారూడీపై విజయం సాధించింది.
కర్ణాటక లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్ రుతుజా భోంస్లే కూడా ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్లో రుతుజా 4-6, 6-3, 6-2తో డియానా (లాత్వియా)పై గెలుపొందింది. మహిళల డబుల్స్లో రుతుజా-జాక్వెలిన్ జోడీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.