కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్కు దూసుకెళ్లింది. స్వల్ప విరామం తర్వాత బరిలోకి దిగిన ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు.. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్స్లో 21-13, 12-21, 21-14తో కొరియా అమ్మాయి సిమ్ యు జిన్పై పోరాడి గెలిచింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి రౌండ్ అలవోకగానే నెగ్గిన సింధు.. ఆ తర్వాత తడబడినా మళ్లీ మూడో రౌండ్లో పుంజుకుని క్వార్టర్స్కు అర్హత సాధించింది.
అష్మిత చాహిల.. 21-19, 16-21, 21-12తో పదో ర్యాంకర్ బీవెన్ జంగ్ (యూఎస్ఎ)ను చిత్తుచేసి క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్లో కిరణ్ జార్జి.. 13-21, 18-21తో మలేషియా ఆటగాడు లి జి జియా చేతిలో ఓడటంతో అతడి పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్లో త్రిసా – గాయత్రి జోడీ.. 18-21, 22-20, 14-21తో కొరియన్ ద్వయం సుంగ్ షువొ యున్-యు చీన్ హుయి ధాటికి చిత్తైంది. మిక్స్డ్ డబుల్స్ జంట సుమిత్ – సిక్కీ.. 9-21, 15-21తో చెన్ టాంగ్ జీ – టో ఈ వీ (మలేషియా)కు తలవంచింది.