ఫ్రాన్స్ దేశంలోని ఓర్లీన్స్ జరిగిన ఓర్లీన్స్ మాస్టర్స్ 2022 షటిల్ టోర్నమెంట్లో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ రజత పతకం సాధించాడు. అద్భుతమైన విజయాలతో ఫైనల్ చేరుకున్ మిథున్.. ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాడైన టోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. వరుసగా రెండు రౌండ్లలో 21-11, 21-19 తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఫ్రెంచి ఆటగాడి ఆధిపత్యం ముందు పూర్తిగా తేలిపోయిన మిథున్.. రెండో రౌండ్లో అనూహ్యంగా పుంజకున్నాడు.
ప్రత్యర్థి కొన్ని పొరపాట్లు కూడా చేయడంతో ఒకానొక సందర్భంలో 12-6 లీడ్తో గెలిచేలా కనిపించాడు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టోమా అద్భుతమైన పోరాటపటిమ చూపించి చివరకు 21-19తో రెండో రౌండ్ కూడా గెలుచుకున్నాడు. అంతకుముందు, టోర్నమెంట్లో టాప్ సీడ్ అయిన సాయి ప్రణీత్.. ప్రిక్వార్టర్స్లోనే వెనుతిరిగి నిరాశ పరిచాడు.