బ్యాంకాక్ : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరు దాదాపు ముగిసింది. గురువారం జరిగిన గ్రూపు రెండో మ్యాచ్లో ప్రణయ్ 21-23, 21-17, 19-21 స్కోరుతో చైనాకు చెందిన లు గువాంగ్ జూ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్లో రెండు మ్యాచ్ పాయింట్లు కాచుకుని, రెండో గేమ్ను గెలుచుకుని స్కోరు సమం చేసిన ప్రణయ్ చివరి గేమ్లోనూ గట్టి పోటీ ఇచ్చాడు. ప్రణయ్కిది వరుసగా రెండో ఓటమి కావడంతో సెమీస్ అవకాశాలు దాదాపు మకుపోయాయి.