ఢిల్లీ: భారత రైఫిల్ షూటింగ్ ద్వయం ఇలవెణిల్ వలరివన్, అర్జున్ బబుతా ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్షిప్లో పసిడి వెలుగులు పంచారు. ఆదివారం ఇక్కడ జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో వలరివన్, అర్జున్ జోడీ.. 505 పాయింట్లు స్కోరు చేసి గోల్డ్ మెడల్ కొట్టింది.
శనివారం జరిగిన మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన వలరివన్.. మిక్స్డ్ పోరులోనూ రాణించి 24 షాట్స్లో 253.4 స్కోరు చేయగా అర్జున్ 251.6 సాధించాడు. ఈ పోటీల్లో దక్షిణకొరియా (501) రజతం గెలువగా జపాన్ (437.1) కాంస్యం సాధించాయి.